Peddapalli : పెద్దపల్లి జిల్లాలో ఓ చెక్ డ్యాంను కూల్చేందుకు దుండుగులు ప్రయత్నించారు.పెద్దపల్లి మండలం బోజన్నపేట- కొత్తపల్లి మధ్యలోని హుస్సేన్ మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేందుకు సోమవారం రాత్రి ప్రయత్నించారు. ట్రాక్టర్ లో డ్రిల్లింగ్ మెషిన్, డిటోనేటర్లు, జిలిటిన్ స్టిక్స్ తీసుకొని వెళ్లారు. అయితే కూల్చేందుకు పయత్నిస్తున్న సమయంలో గ్రామస్తులు చూడటంతో అక్కడ నుంచి పారిపోయారు.
చెక్ డ్యాం నిర్మాణం వల్ల కిందకు నీరు రావడం లేదని పేల్చేందుకు ప్రయత్నం చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్లో డిటోనేటర్ లు, జిలిటిన్ స్టిక్స్, డ్రిల్లింగ్ మెషిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.