Indirapark Dharna: ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా మొదలైంది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్వద్ద ధర్నా ప్రారంభమైంది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు పాల్గొననున్నారు.
ఈ నెల 13న లోక్సభలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి స్మోక్బాంబులతో కలకలం సృష్టించారు. భయాందోళనకు గురైన ఎంపీలు బయటకు పరుగులు తీశారు. దీనిపై ఆరోజు నుంచి ప్రతిపక్ష ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. అయితే నిరసన తెలుపుతున్న ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. చివరిరోజు కూడా లోక్ సభలో ముగ్గురిపై వేటు పడింది. దీంతో ఈ సారి సమావేశాల్లో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.