Congress Mlc : కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్ధులు బల్మూరి వెంకట్ , మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని తీసుకునేందుకు బల్మూరి వెంకట్ భారీ ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు.
Congress MLC Update(Telangana news today):
కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్ధులు బల్మూరి వెంకట్ , మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని తీసుకునేందుకు బల్మూరి వెంకట్ భారీ ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ రాగా.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవం కారణంగా ఎన్నికలతో పని లేకుండాపోయింది.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ల పేర్లను ప్రకటించడంతోనే గెలుపు ఖాయమనుకున్నారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, సీడబ్ల్యూసీ సభ్యులు, ఇతర నాయకులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ గెలుపు ఏకగ్రీవమవుతుందని అప్పుడే రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు.