Congress comments on KCR: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్లో గుబులు రేపుతోందా? కేసీఆర్కు పదవికి గండం పొంచి ఉందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తు న్నాయి.
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగుతోంది. చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. విద్యుత్ సెక్టార్పై అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ సర్కార్ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని దుయ్య బట్టారు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి. దీనిపై కమిషన్ వేశామని, దర్యాప్తు జరుగుతోందన్నారు.
ఈ విషయంపై కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు రాజగోపాల్. ఆయన సభకు రాలేనప్పుడు ప్రతిపక్షహోదా ఎందుకని ప్రశ్నించారు. ఆ పదవిని వేరే నేతకు ఇస్తే బాగుండేదన్నా రు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మాటలు విన్న నేతలు, కేసీఆర్ పదవికి టెండర్ పెడుతున్నట్లు కనిపిస్తోంద ని కారు పార్టీ నేతలు అసెంబ్లీ లాబీల్లో చర్చించుకోవడం మొదలైంది.
ALSO READ: అసెంబ్లీలో 19 పద్దులపై చర్చ..విద్యుత్ సెక్టార్పై వాడీవేడిగా!
అదే సమయంలో ఏపీలో ప్రతిపక్ష పదవి కోసం విపక్షం చేస్తున్న ప్రయత్నాలను గుర్తుచేశారు. తనకు ఆ పదవి ఇవ్వండి మహాప్రభో అంటూ ఓ నేత మొరపెట్టుకున్నారని చెబుతున్నారు. హోదా ఉండి ఒకరు, హోదా లేక మరొకరు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం భలే విచిత్రంగా ఉందని అంటున్నారు. కేసీఆర్-జగన్ బంధం గురించి తెలిసినవాళ్లు మాత్రం, కేసీఆర్ ఏం చేస్తే.. జగన్ కూడా అదే బాటలో నడుస్తారని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేతలిద్దరు బయటకు రావడానికి జంకుతున్నా రని చెబుతున్నారు.