Bandi Sanjay latest news(Political news today telangana):
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు.. కరీంనగర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
బండి సంజయ్ ఏ ఆధారాలతో మాట్లాడారో.. తేల్చాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు ఉంటే, కుట్ర తెలిసికూడా బయటపెట్టనందుకు.. బండి సంజయ్పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఆధారాల్లేకుండా మాట్లాడినా.. బండి సంజయ్పై కేసు నమోదు చేయాలంటున్నారు.