గత ప్రభుత్వంలోని ఇరిగేషన్, ఆర్థిక శాఖల మంత్రులకు నోటీసులు జారీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఇరిగేషన్, ఆర్థిక, కాళేశ్వరంకు సంబంధించిన శాఖల్లో పని చేసిన సెక్రటరీలను కమిషన్ విచారించింది. కాగా.. ఇప్పుడు మరికొంత మంది కీలక నేతలకూ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందట. అలాగే.. ఇప్పటివరకు అఫిడవిట్ ఇవ్వని అధికారులపై కమిషన్ సీరియస్ గా ఉంది.
Also Read: కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకి మధ్యంతర బెయిల్
ఇప్పటివరకు కమిషన్ ముందుకు 50కిపైగా అఫిడవిట్స్ వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ డేటా ఆధారంగా మరికొంత మందికి సమన్లు జారీ ని తెలుస్తోంది. అఫిడవిట్ దాఖలు చేయని వారిలో మాజీ సీఎస్ కూడా ఉన్నారు. మాజీ మంత్రుల విచారణ అనంతరం వారిచ్చే అఫిడవిట్లు ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్కూ నోటీసులు ఇచ్చే అవకాశముంది.