తెలంగాణ ఆర్థిక పరిస్థతిపై శాసన సభలో విడుదల చేసిన శ్వేత పత్రంపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణాను బలమైన రాష్ట్రంగా నిలపడమే ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవ పరిస్థతులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని, అందుకే ఆర్భీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారన్నారు.
శ్వేత పత్రం విషయంలో తాము కొత్తగా చేసింది ఏమీ లేదు గత ప్రభుత్వం చేసిన ఖర్చులను ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశామన్నారు. అనుమానాలను తీర్చేందుకే అవసరమైన చోట ఆర్భీఐ, కాగ్ నివేదికలను ప్రస్తావించామన్నారు.