CM Revanthreddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాగ్ పూర్ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభను నాగ్ పూర్ లో నిర్వహిస్తున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉన్నారు. నాగ్ పూర్ విమానశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు వారిని శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.
CM Revanthreddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాగ్ పూర్ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభను నాగ్ పూర్ లో నిర్వహిస్తున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వెళ్లారు.
నాగ్ పూర్ విమానాశ్రయంలో సీఎం దిగిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు వారిని శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ ఆద్వర్యంలో నిర్వహించిన 139వ ఆవిర్భావ సభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
దేశంలో మోడీ ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందన్నారు. రాహుల్ గాంధీ రెండోసారి భారత్ న్యాయ యాత్రతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖేల్ ఖతం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ 100 రోజులు దేశం కోసం..కార్యకర్తలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.