EPAPER

CM Revanth Reddy tweet : జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. ప్రజా దర్బార్ పై రేవంత్ ఎమోషనల్ ట్వీట్..

CM Revanth Reddy tweet : జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. ప్రజా దర్బార్ పై రేవంత్ ఎమోషనల్ ట్వీట్..

CM Revanth Reddy Tweet : ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొలి ప్రజా దర్బార్‌ పై ఎమోషనల్ గా ట్వీట్‌ గా చేశారు. జనం కష్టాలు వింటూ… కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగిందని పేర్కొన్నారు. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పుడు విని.. వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుందని ట్వీట్‌ చేశారు.


సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారమే ఉదయం 10 గంటలకు జ్యోతిరావుఫూలే ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు సామాన్యులు భారీగా తరలి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఇకపై ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. అభాగ్యుల సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి చేపట్టారు. గతంలో ప్రగతి భవన్ గా ఉన్న సమయంలో ఇక్కడ ఆంక్షలు ఉండేవి.


బీఆర్ఎస్ పాలనలో సామాన్యులనే కాదు గద్దర్ లాంటి తెలంగాణ యుద్ధనౌకను అడ్డుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ప్రారంభంకాగానే ప్రగతి భవన్.. ప్రజా భవన్ గా మారిపోయింది. సామన్యుడు తన సమస్యను ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం దక్కింది. కాంగ్రెస్ ముందునుంచి చెబుతున్నట్లుగానే తమది ప్రజా ప్రభుత్వమని తొలి అడుగులోనే నిరూపించుకుంది.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×