CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరుతుండగా ఆయన కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని చూసిన సీఎం స్వయంగా ప్రజల ముందుకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తామని.. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. ప్రజలకు సేవ చేసేందుకే మేము ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలా ఇచ్చిన హామీలను విస్మరించమన్నారు. ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా తానే ప్రజలను వినతి పత్రాలను స్వీకరించారు. వినతి పత్రాల్లో పేర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్లి పోయారు.