CM Revanth Reddy : తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
CM Revanth Reddy : తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ జనగణన చేపడతామని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.