EPAPER

Revanth Reddy: ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?

Revanth Reddy: ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?

CM Revanth Reddy to leave for Delhi: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న ఢిల్లీకి మరోసారి వెళ్లనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద పలు అంశాలపై చర్చలు జరపనున్నారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుతోపాటు పలు అంశాలపై పార్టీ అధిష్టానంతో సీఎం, మంత్రులు చర్చలు జరిపే అవకాశమున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.


Also Read: మరుగుదొడ్డిలోనే మల్లమ్మ నివాసం.. చలించిపోయిన సీఎం రేవంత్

అయితే, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజుల నుంచి ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేస్తున్నది. కానీ, సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా నామినేటెడ్ పదవులకుసంబంధించి ఇప్పటికే పలువురి పేర్లతో ఓ జాబితాను రెడీ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Also Read: బీసీ కుల గణనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు… 3 నెలల్లోపు..

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×