CM Revanth Reddy travel on driverless: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అమెరికా టూర్ ముగిసింది. దాదాపు 10 రోజుల టూర్లో 19 కంపెనీలు దాదాపు 31 వేల కోట్లు రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
దాదాపు 50 కంపెనీలతో సమావేశమైంది రేవంత్ టీమ్. ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సెన్సెన్స్, విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే దిశంగా ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి.
అమెరికా పర్యటనపై సీఎం రేవంత్రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పేరు పొందిన కంపెనీలతో సంప్రదింపులు జరిపామన్నారు. ముఖ్యంగా స్కిల్ యూనివర్సి టీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ సిటీ నిర్మించే దిశగా అడుగులు వేశామన్నారు.
ALSO READ: బీఆర్ఎస్ వలస నేతలకు కాంగ్రెస్ ‘తాయిలాలు‘ సిద్ధం
అమెరికాలోకి బిజినెస్మేన్ల నుంచి భారీ మద్దతు లభించిందన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని అక్కడికి కంపెనీలకు వివరించామన్నారు. ఈ టూర్ తెలంగాణకు మంచి ఫలితాలు వస్తాయని, పెట్టుబడులతోపాటు వేలాది ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా టూర్ చివరలో శాన్ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ రహిత కారులో ప్రయాణించారు సీఎం రేవంత్రెడ్డి. దాదాపు పావుగంట సేపు అందులో ట్రావెల్ చేశారు. ఆ తరహా కార్లు, టెక్నాలజీ ఇండియాకి వస్తే, ప్రయాణం మరింత సులభంగా మారుతుందన్నారు. అమెరికా టూర్ ముగించుకున్న సీఎం రేవంత్రెడ్డి అక్కడి నుంచి సౌత్కొరియా రాజధాని సియోల్కు చేరుకున్నారు.
అమెరికా: శాన్ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ రహిత కారులో ప్రయాణించిన సీఎం రేవంత్ రెడ్డి.#RevanthReddyUStour #Congress #RevanthReddy #Waymo #NewsUpdates #Bigtv @INCTelangana @revanth_anumula pic.twitter.com/pgS0Rn8JEw
— BIG TV Breaking News (@bigtvtelugu) August 12, 2024