చెప్పాడంటే.. చేస్తారంటే. ఇదీ.. సీఎం రేవంత్రెడ్డి పనితీరుపై జనాల్లో ఉన్నమాట. నాడు చెరుకు రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకు రైతులకు తీపి కబురు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సిఫార్సుల కమిటీని నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
తొమ్మిదేళ్లుగా మూతబడి ఉన్న ఫ్యాక్టరీ తెరుచుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదని చెబుతున్నారు. పాదయాత్రలో తమ బాధలను విన్న రేవంత్.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫ్లెక్సీలకు అన్నదాతలు పాలభిషేకం చేశారు.