CM Revanth Reddy : గడువులోగా కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు సందేశం పంపారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో నూతన ఓటర్ల నమోదు గడువు ఫిబ్రవరి 6న ముగుస్తుందన్నారు. గడువులోగా తమ పరిధిలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి అశ్రద్ధ చేయకుండా ఈ కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని కోరారు.