EPAPER

TGSRTC: ఆర్టీసీని నిలబెడతాం.. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

TGSRTC: ఆర్టీసీని నిలబెడతాం.. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

– సంస్థను ఆర్థికంగా బలోపేతం చేద్దాం
– రుణాల రీకన్‌స్ట్రక్షన్‌తో వడ్డీ తగ్గించుకోండి
– డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని కొత్త బస్సులు
– మహాలక్ష్మి పథకం సక్సెస్‌‌ను నిలుపుకోవాలి
– ఆర్టీసీ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి


Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న బ‌స్సుల కొనుగోళ్లు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరిగిన అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ఇందుకు ప్రతిపాదిక చేసుకోవాల‌ని సూచించారు. మంగళవారం సచివాలయంలో టీజీ ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు.

మహాలక్ష్మీ పథకంపై ఆరా..
తెలంగాణ వ్యాప్తంగా మ‌హాల‌క్ష్మి ప‌థకం కింద ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి, ఆ పథకం వివిధ వర్గాల మహిళలకు ఎలా ఉపయోగపడుతోంది? వంటి అంశాలను సీఎం ఆరా తీశారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా ఉంద‌ని, ఇప్పటి వ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్రయాణం చేశార‌ని అధికారులు వివరించారు. ఉచిత ప్రయాయం వల్ల ఇప్పటి వరకు మహిళలకు రూ.2,840.71 కోట్లు ఆదా అయిందని ర‌వాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ తెలిపారు. ఆర్టీసీలో 7,292 బ‌స్సులలో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ర్తిస్తోంద‌న్నారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ప్రారంభ‌మైన త‌ర్వాత వివిధ జిల్లాల నుంచి హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రుల‌కు వ‌స్తున్న మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతోంద‌ని, అందుకు సంబంధించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌ను సీఎంకు అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్రజంటేష‌న్ లో చూపారు.


పెరిగిన ఆక్యుపెన్సీ
మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంతో ఆక్యుపెన్సీ రేటు పెర‌గ‌డంతో పాటు సర్కారు చెల్లిస్తున్న రీయింబ‌ర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వ‌స్తోంద‌ని అధికారులు సీఎంకు తెలిపారు. మారుతున్న అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు పెంచాలని, కాలేజీలకు బస్సుల్లో వెళ్లే విద్యార్థుల సమయానికి తగినట్లు సర్వీసులు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.

Also Read: Revanth Reddy: ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?

సంస్థ ఆర్థిక పరిస్థితిపై చర్చ
అనంత‌రం వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భ‌విష్యత్ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు క‌లిపి రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు వివ‌రించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు చెల్లిస్తున్న వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని.. వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు, అప్పుల రీక‌న్‌స్ట్రక్షన్‌పై అధ్యయ‌నం చేయాల‌ని సీం ఆదేశించారు. వచ్చిన లాభాలతో క్రమంగా రుణ‌భారం త‌గ్గించాల‌ని సూచించారు. ఈ స‌మీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శులు చంద్రశేఖ‌ర్‌రెడ్డి, షాన‌వాజ్ ఖాసీం, ర‌వాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి వికాస్ రాజ్‌, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్, తదిత‌ర అధికారులు పాల్గొన్నారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×