CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ లో లోపాలపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ కు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ధరణి యాప్ సెక్యూరిటీపైనా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న ఆరోపణలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై మాట్లాడారు. అలాగే కొన్ని కీలక అంశాలను చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించాలని కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో భేటీ అయ్యేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు.