తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వరుస సమీక్షలతో బిజీ అయ్యారు. డ్రగ్స్ నియంత్రణపై ఫోకస్ పెట్టిన ఆయన.. ఎక్సైజ్, నార్కోటిక్ నియంత్రణపై సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. సమీక్షలో రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ఎవరు మాదకద్రవ్యాలు వినియోగించిన, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాఖాపరమైన బలోపేతం కోసం ఏది కావాలంటే అది చేస్తామని..రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నారు. ప్రతి నెల నార్కోటిక్ బ్యూరో పైన తప్పకుండా రివ్యూ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్ను నియమించడంతోపాటు.. ఆ విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అందుకు కావాల్సిన నిధులు, వనరులు, ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలన్నారు.