CM Revant reddy: ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మరో సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. కోరుట్లలో కాంగ్రెస్ జన జాతర సభలో పాల్లొన్న సీఎం ప్రసంగించారు.రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
మోదీ దేశ సంపదను దోచి అంబానీ, అదానీలకు పంచేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే తనపై కేసులుపెట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతలు కాంగ్రెస్ ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్లు రద్దు చేయడమేనా.. అని ప్రశ్నించారు.
Also Read: అమిత్ షా ఫేక్ వీడియో కేసు : కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతకు నోటీసులు
ప్రధాని హోదా మరచి మోదీ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలు గుజరాత్ ఆదిపత్యం, తెలంగాణ పౌరుషానికి మధ్య జరిగే ఎన్నికలని అన్నారు. మోదీ రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ఎందరో వీరులు పుట్టిన తెలంగాణ ప్రజలు ఎవరికీ బయపడరని తెలిపారు. త్వరలోనే నిజాం,రజాకార్లకు పట్టిన గతే బీజేపీకి పడుతుందని అన్నారు.