Praja Darbar : తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాట ప్రకారమే శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ వద్దకు భారీగా ప్రజల తరలివచ్చారు. వారి నుంచి అర్జీలను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. వినతిపత్రాలను సీఎం స్వీకరించి పరిశీలించారు. క్యూలైన్లలోకి వెళ్లి మరీ వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే ఆర్జీలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఇకపై ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తామని గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకవైపు సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే మరోవైపు ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను ఎత్తివేశారు. అక్కడ వేసిన ఇనుప కంచెలను తొలిగించారు. బారికేడ్లును తీసివేశారు. ఇక ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చని సీఎం తెలిపారు. అలాగే ప్రగతి భవన్ పేరు ప్రజాభవన్ గా మార్చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే ప్రజల భారీగా క్యూకట్టారు. సీఎంను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.
ప్రజాభవన్ వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకుని ఆ తర్వాత క్యూలైన్లలో లోపలికి అనుమతించారు.