EPAPER

CM Revanth Reddy: మీరు హుస్సేన్ సాగర్‌కు వెళ్తున్నారా..? అయితే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన గుడ్‌న్యూస్ మీ కోసమే..

CM Revanth Reddy: మీరు హుస్సేన్ సాగర్‌కు వెళ్తున్నారా..? అయితే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన గుడ్‌న్యూస్ మీ కోసమే..

CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నగర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో బౌద్ధ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా నల్లగొండలోని నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని, దీనితోపాటు బోటింగ్ ను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నది.


వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో ఉన్నటువంటి బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశ విదేశాల్లోని బుద్ధిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియంను నెలకొల్పే ప్రతిపాదనలను సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో చారిత్రాత్మకంగా పేరొందిన నేలకొండపల్లి, ఫణిగిరి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతోపాటు హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ ను సైతం పంపించిన విషయం తెలిసిందే. రూ. 25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదనలు చేసింది.

Also Read: మీరు గ్రూప్ -3 పరీక్ష రాస్తున్నారా..? అయితే, ఈ గుడ్‌న్యూస్ తెలుసా..??


అదేవిధంగా వీటితోపాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియంను ఈ ప్రణాళికలో పొందుపరచనున్నది. అందులో భాగంగా నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని టూరిజం, స్పిర్చువల్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దనున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ అందాలతోపాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్రం సంకల్పించింది. నాగార్జున సాగర్ పర్యటనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్ లో విహరించేందుకు ఏర్పాటు పునరుద్ధరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్శించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలను రూపొందించనున్నారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్ ను నిర్మించనున్నారు. ఈ రహదారికి ప్రతిపాదనలను తయారు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆదేశించారు.

Also Read: హైడ్రా ఏమైనా సర్వరోగ నివారిణా?: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ట్యాంక్ బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కై వాక్ వే డిజైన్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం రూపొందించాలంటూ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అనుభవమున్న కన్సెల్టీన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూన డిజైన్లు తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు. గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లు కూడా ఇరుకుగా ఉన్నాయని, వాటిని కూడా విశాలంగా చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణలుంటే తొలగించాలని, అక్కడున్న ఇండ్లవాసులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వారికి ఇంకోచోట పునరావసం కల్పించాలన్నారు.

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×