నిర్మల్కు చెందిన మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి (93) ఇవాళ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే , ఎంపీ , ఎమ్మెల్సీ , పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.
నర్సారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. నర్సారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. నర్సారెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా ప్రజలకు ఆయన అనేక సేవలందించారని గుర్తుచేశారు.
ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా నర్సారెడ్డి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన అనుభవాలు నేటి తరం నాయకులకు మార్గదర్శకమని సీఎం రేవంత్ తెలిపారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.