EPAPER

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోంది.. ‘గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్’ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోంది.. ‘గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్’ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy on National PoliticsCM Revanth Reddy on National Politics(Political news in telangana): దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్రపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గిపోతోందని సీఎం రేవంత్ రెడ్డి వాపోయారు. దీనికి కారణం పార్ట్ టైమ్ రాజకీయనాయకులేనని అభిప్రాయపడ్డారు. ఆదివారం తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్ రావు రచించిన గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్ అనే పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇదొక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందని తెలిపారు.


ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజకీయాలలో తెలుగువారి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీలం సంజీవరెడ్డి, పీవీ, ఎన్టీఆర్ దేశ రాజకీయాలను శాసించారని.. ఇది తెలుగువారందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు. వారి తర్వాత సూదిని జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు దేశ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.

కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఎవరిని కలవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు తెలుగువారికి సంభందించిన అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించే నేతలు కరువయ్యారని తెలిపారు.


Read More: బీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే.. ఆ ఎంపీ సీటు కోసమేనా?

దేశ రాజకీయాలలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పీవీ దేశ ప్రధానిగా నంద్యాలలో పోటీ చేస్తే ఎన్టీఆర్ పీవీ మీద అభ్యర్ధిని పెట్టలేదన్న సంగతిని గుర్తుచేశారు. తెలుగువారి కోసం రాష్ట్రాలుగా విడిపోయినా కలిసుందాం అని పేర్కొన్నారు.

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×