CM Revanth Reddy : హైదరాబాద్ రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గవర్నర్ తమిళిసైను కలిసి సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంతోపాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కొందరు ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ కు న్యూఇయర్ విషెస్ చెప్పారు. గవర్నర్ కు పుష్పగుచ్చం అందించారు. శాలువా కప్పి సత్కరించారు.