CM Revanth Reddy Met Priyanka Gandhi(Telangana today news): కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపదాస్ మున్షీ కలిశారు. ఆమెతో తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు.
మంత్రి హర్దీప్ సింగ్ తో వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ను సరఫరా చేస్తున్న విషయాన్ని తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.