CM Revanth Reddy Launching: వన్ స్టేట్.. వన్ కార్డు విధానంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. కుటుంబానికి రక్షణ కవచంగా ఈ డిజిటల్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు.
ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రైతు బీమా కార్డు అని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మీ పథకాలు అమలవుతాయని చెప్పుకొచ్చారు. గురువారం సికింద్రాబాద్ సిక్ విలేజీ ప్రాంతంలోని హాకీ మైదానంలో కుటుంబ గుర్తింపు, డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు సీఎం.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇవాళ్టి నుంచి 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామని, ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు అందించాలని ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కొంతమందికి రేషన్ కార్డుకి, ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమన్నారు సీఎం. 30 శాఖల సమాచారంతో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరుస్తామని, ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం. ప్రతీ నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని పర్యవేక్షణగా నియమిస్తున్నామని, ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే కుటుంబ పెద్దగా పొందుపరుస్తున్నామని వివరించారు.
ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే అన్ని సంక్షేమ పథకాలు : రేవంత్
ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు,రైతు భీమా కార్డు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మీ.
ఈ డిజిటల్ కార్డు….మీ కుటుంబానికి రక్షణ కవచం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.… pic.twitter.com/tR01p2pDZw
— BIG TV Breaking News (@bigtvtelugu) October 3, 2024