CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్దకు వెళ్లారు. అక్కడ కొనసాగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఏర్పాట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డికి వివరించచారు. నేరుగా నిమజ్జనం జరుగుతున్న చోటకు వెళ్లి దగ్గరుండి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. క్రేన్ డ్రైవర్లు, ఇతర సిబ్బందితో కాసేపు మాట్లాడారు. అదేవిధంగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న నేపథ్యంలో వారికి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు వెంటనే ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. కాగా, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో ట్యాంక్ బండ్ పై ఓ జీహెచ్ఎంసీ కార్మికురాలి వద్దకు ఆమెను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వచ్చిన నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Also Read: గంగమ్మ ఒడికి గణనాథుడు.. ఆద్యంతం “జై గణేశా” నామస్మరణతో మారుమ్రోగిన భాగ్యనగర వీధులు