EPAPER

CM Revanth Reddy: ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ ఆరా !

CM Revanth Reddy: ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ ఆరా !

CM Revanth Reddy: ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌తో మాట్లాడారు. ఘ‌ట‌న ఎలా జరిగింది.. అందుకు సంబంధించిన వివ‌రాలతో పాటు తెలంగాణ వాసులు ఎవ‌రైనా ఉన్నారా అని ప్ర‌శ్నించారు. మృతుల్లో ఎవ‌రైనా రాష్ట్ర వాసులంటే బాధిత కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ‌ స‌హ‌కారాలు అందించాల‌ని ఆదేశించారు.


తెలంగాణ వాసులు ఎవ‌రూ లేర‌ని రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ తెలిపారు. మృతుల్లో తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందిన యువ‌తి అని, ఆమె తండ్రి విజ‌య్ కుమార్ సింగ‌రేణి సంస్థ‌లో సీనియ‌ర్ మేనేజ‌ర్‌గా మంచిర్యాల‌లో ప‌ని చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రికి తెలిపారు. తానియా సోని మృత‌దేహాన్ని  తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీంతో విజ‌య్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని రెసిడెంట్ క‌మిష‌న‌ర్‌ను సీఎం ఆదేశించారు.

ఢిల్లీలో శనివారం భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్‌లో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ లోకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఈ ఘటనలో అక్కడే చదువుకుంటున్న విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా సీఎం ఈ ఘటనపై ఆరా తీసారు.


Related News

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా.. తొలిసారి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కి కూడా.. : సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Big Stories

×