CM Revanth Reddy: హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టూంబ్ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు CM రేవంత్ రెడ్డి ఆతిధ్యం ఇచ్చారు. ఈ ఆతిథ్యానికి అమెరికా,ఇరాన్,తుర్కియే, UAE, UK, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక ,బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందన్న సీఎం రేవంత్.. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు ముందుకు రావాలని కోరారు.
స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీనీ స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఇక అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి..తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆతిధ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు.
.
.