CM Revanth Reddy : వైద్యఆరోగ్య శాఖ మంత్రి నియామకాలు త్వరగా జరిగేలా చూశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. స్టాఫ్ నర్సులగా ఎంపిక అయిన వారికి సీఎం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చాలా రోజులుగా పెండింగ్లో ఉండేవన్నారు. ఆ సమస్యను త్వరగా పరిష్కరించగలిగామని ఆయన తెలిపారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితిపై సమీక్షించి నియామకాలు త్వరగా జరిగేలా చూశామన్నారు. ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వాములం అయినందుకు సంతోసంగా ఉందని సీఎం తెలిపారు.
CM Revanth Reddy : టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసి సీఎం మాట్లాడారు.
వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చాలా రోజులుగా పెండింగ్లో ఉండేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ సమస్యను త్వరగా పరిష్కరించగలిగామని ఆయన తెలిపారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి సమీక్షించి నియామకాలు త్వరగా జరిగేలా చూశారన్నారు. ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వాములం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వం వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించిందన్నారు. నిరుద్యోగుల సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై గత ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.