CM Revanth Reddy Extends Greetings to Bandi and Kishan: బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటు ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు కూడా రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదల కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ప్రాజెక్టుల సాధన కోసం చర్యలు తీసుకోవాలన్నారు.
మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రపతి భవన్ లో సాయంత్రం ప్రమాణం చేశారు. ప్రధాని తరువాత 71 మంది ప్రమాణం చేశారు. వారిలో 30 మందికి కేబినెట్ హోదా దక్కింది. కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు ఉన్నారు.
Also Read: తెలంగాణ బీజేపీ సారథి ఎవరు? కొత్త వ్యక్తి కోసం హైకమాండ్ అన్వేషణ
కాగా, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నేడు కేంద్ర కేబినెట్ తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా మంత్రులకు శాఖలు కేటాయించారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించగా, హంశాఖ సహాయమంత్రిగా బండి సంజయ్ ను నియమించారు. శాఖను కేటాయించారు. ఇటు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు.