CM Revanth Reddy Delhi Tour : రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలే అజెండాగా సీఎం రేవంత్రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి.. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో.. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు సమావేశం అయ్యారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ కేటాయించాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో రేవంత్ బృందం సమావేశమైంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపైనా నేతలు చర్చించారు.
కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమై వేర్వేరు పద్దుల కింద రాష్ట్రానికి రావలసిన 2వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల పర్యటన తర్వాత రేవంత్రెడ్డి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.