CM Revanth Reddy Delhi Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. సీఎంతోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా.. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు కూడా ఢిల్లీ వెళ్లారు. వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన సాయం, నిధుల విడుదలపై విజ్ఞప్తి చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
UPSC ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోనితో భేటీ అయింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్. UPSC పనితీరు పరిశీలిస్తున్నారు. పరీక్షల నిర్వహణపై చర్చిస్తున్నారు.ఇప్పటికే కేరళలో పర్యటించి అక్కడి సర్వీస్ కమిషన్ పనితీరును IASల బృందం అధ్యయనం చేసింది.
ఇక గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు సీఎం రేవంత్. అలానే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ తో రేవంత్ రెడ్డి తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.