CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఓ అంబులెన్స్కు దారిచ్చిన విషయం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా ఓ అంబులెన్స్ వస్తున్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి కాన్వాయ్ వెంటనే ఆ అంబులెన్స్కు దారిచ్చింది.
దీంతో అంబులెన్స్ ముందుకు వెళ్లింది. ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలో క్షణం ఆలస్యమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఔదార్యంపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
సీఎంగా బాధ్యత చేపట్టిగానే రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తాను వెళుతున్న సమయంలో ఎక్కువ సేపు ట్రాఫిక్ ఆపి సామాన్యులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. మాటల్లోనే కాదు ఇప్పుడు చేతనల్లోనూ తమది ప్రజాప్రభుత్వం అని నిరూపించారు.