CM Revanth Foreign Tour: రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. జనవరి 15 నుంచి 19 మధ్య దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కూడా వెళ్తారు. మరికొంత మంది ఉన్నతాధికారులు దావోస్కు వెళ్లనున్నారు.
ఈ సదస్సులో ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని.. మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తామని వివరించనున్నారు. తెలంగాణ ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఆ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో వంద దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి ల్యాబ్ నుంచి ‘లైఫ్ టు లైఫ్ – సైన్స్ ఇన్ యాక్షన్’ పేరుతో ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి.. పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు.
.
.