KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేతలందరూ ఇందుకు సన్నద్ధం కావాలని సూచించారు.
తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉందని.. నేతలంతా ఇందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేలందరూ వారివారి నియోజకవర్గాల్లోనే ఉండాలని.. వీలైతే పాదయాత్ర చేయాలన్నారు. సభలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అలాగే వరంగల్లో ఏప్రిల్ 27న భారీబహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.