KCR: ప్రకంపనలు సృష్టించిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై భగ్గుమన్నారు. శనివారం కవితను ఈడీ అరెస్ట్ చేయొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిన్న మంత్రి గంగులు, ఎంపీ రవిచంద్ర.. ఇప్పుడు తన బిడ్డ కవిత వరకు వచ్చారని మండిపడ్డారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోనివ్వండి అంటూ ఫైర్ అయ్యారు. కవిత ఎంత మంచిగా పనిచేసినా బద్నాం చేస్తున్నారన్నారు. ఎంత మందిని అరెస్ట్ చేసినా భయపడేది లేదని.. పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
అందరూ అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాలని గులాబీ నేతలకు సూచించారు. కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని అన్నారు.