EPAPER
Kirrak Couples Episode 1

KCR: అందుకే కరెంట్ డిపార్ట్‌మెంట్లో ఒక్క ఐఏఎస్‌ కూడా లేరు.. కేసీఆర్ చెప్పిన సీక్రెట్..

KCR: అందుకే కరెంట్ డిపార్ట్‌మెంట్లో ఒక్క ఐఏఎస్‌ కూడా లేరు.. కేసీఆర్ చెప్పిన సీక్రెట్..
kcr_electricity

KCR: సీఎం కేసీఆర్ ఇంట్రెస్టింగ్ మేటర్ చెప్పారు. గడిచిన పదేళ్లుగా కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఒక్కరంటే ఒక్క ఐఏఎస్‌ను కూడా నియమించలేదని చెప్పారు. అందుకో కారణం ఉందని సీక్రెట్ రివీల్ చేశారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో.. ఉచిత విద్యుత్ కోసం కరెంట్ శాఖ అధికారులందరినీ పిలిచి మీటింగ్ పెట్టానని చెప్పారు. రాష్ట్రమంతా నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడం సాధ్యమా? కాదా? అని అడిగితే.. అధికారులు 5 రోజులు టైమ్ అడిగారని అన్నారు. వాళ్లు బాగా ఆలోచించుకుని వచ్చి.. మీరు తలుచుకుంటే సాధ్యమేనని చెప్పారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కాకపోతే వాళ్లు తన దగ్గర కొన్ని డిమాండ్లు పెట్టారని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని ట్రాన్స్‌ఫార్మర్లు అన్నిటినీ రేషనలైజ్ చేయాలని.. ఎమర్జెన్సీ సమయంలో అప్పటికప్పుడు బయటి నుంచి పవర్ కొనేందుకు.. ఎలాంటి అనుమతులు లేకుండా వెంటనే వాడుకునే అవకాశం ఉండేలా 25 కోట్ల నిధులు అందుబాటులో ఉంచాలని అన్నారని.. అందుకు తాను సరేనన్నానని చెప్పారు సీఎం.


ఇక, విద్యుత్ శాఖలో ఏదైనా ఫైల్ పుటప్ చేస్తే.. మంత్రితో మాట్లాడాలి, సీఎంతో మాట్లాడాలి అంటూ ఐఏఎస్ అధికారులు ఆలస్యం చేస్తుంటారని.. అదే టెక్నికల్ అధికారులు ఉంటే ఆ ప్రాబ్లమ్ లేకుండా వెంటనే పని అయిపోతుందనే విషయం తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. అందుకే, గడిచిన పదేళ్లలో విద్యుత్ శాఖలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్‌ను కూడా నియమించలేదని చెప్పారు సీఎం కేసీఆర్.

Related News

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

Big Stories

×