CLP Meeting : కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సీఎం అభ్యర్థి పేరును కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించనున్నారు.
హైదరాబాద్ లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ఈ సమావేశం కొనసాగింది.. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు మీట్ అయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాల నివేదికను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం సీఎల్పీ నేతను ఎంపిక చేస్తుంది.
సాయంత్రానికి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరుగుతుందని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరోవైపు సీఎల్పీ సమావేశానికి ముందు పార్క్హయత్ హోటల్లో కాంగ్రెస్ కీలక నేతలతో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలతో వివిధ అంశాలపై డీకే శివకుమార్ చర్చించారు.