Christmas Celebrations: తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో చర్చిలు కిటకిటలాడుతున్నాయి. చిన్నారులు శాంతాక్లాజ్ వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. అర్థరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభించారు. ఏసుజన్మవృత్తాంతాన్ని తెలిపేలా భారీ సెట్టింగులతో చర్చిలు కళకళలాడుతున్నాయి. హైదరాబాద్లోని చర్చిల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది.
క్రిస్మస్ సందర్భంగా.. చర్చిలను అందంగా అలంకరించారు. ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి.. విశ్వాసులకు ఆశీస్సులు అందజేస్తున్నారు. తెలంగాణలోని మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను బిషప్ పద్మారావ్ అర్థరాత్రి మొదటి ఆరాధనతో స్టార్ట్ చేశారు. ఖమ్మం వైరా రోడ్ RCM చర్చి క్రిస్మస్ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏసు ప్రభు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఏపీలోని గుణదల కొండ క్రైస్తవ విశ్వాసులతో కిక్కిరిసిపోయింది. కొవ్వుత్తుల వెలుగుల్లో ఏసుప్రభును కీర్తిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.
.
.