KCR Farm House | తెలంగాణ ఎన్నికల తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. బిఆర్ఎస్ పార్టీ ఓటమి వల్లనే ఆయన ప్రగతిభవన్ నుంచి తన ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన బయటకి రాలేదు. పార్టీ నేతలతో, కార్యకర్తలతో అక్కడే సమావేశాలు జరుపుతున్నారు.
KCR Farm House | తెలంగాణ ఎన్నికల తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. బిఆర్ఎస్ పార్టీ ఓటమి వల్లనే ఆయన ప్రగతిభవన్ నుంచి తన ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన బయటకి రాలేదు. పార్టీ నేతలతో, కార్యకర్తలతో అక్కడే సమావేశాలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనను కలవడానికి ఆయన స్వగ్రామం అయిన చింతమడక నుంచి 540 మంది గ్రామస్తులు.. 9 బస్సుల్లో ఎర్రవెల్లికి తరలి వెళ్లారు. అయితే ఫామ్ హౌస్ చెక్పోస్ట్ వద్ద వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ను కలవడానికి వారికి అనుమతి లేదని చెప్పారు. పోలీసులు నిరాకరించినా గ్రామస్తులంతా కేసిఆర్ను కలిసేంతవరకు తిరిగి వెళ్లమని రోడ్డుపైనే కూర్చున్నారని సమాచారం.
ఇంతకుముందు నవంబర్ 30 పోలింగ్ రోజున, కేసిఆర్ సొంతగ్రామమైన చింతమడకలో ఉదయం నుంచి ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. కానీ 11.30 సమయానికి కేసీఆర్ ఆయన సతీమణి ఓటు వేసేందుకు రాగానే ఒక్కసారిగా ఓటర్లు భారీ సంఖ్యలో లైన్లో నిలబడ్డారు. ఓటు వేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ను దగ్గర నుంచి చూడొచ్చనేది వారి ఆశ. దీనిని బట్టి తెలుస్తోంది.. కేసీఆర్పై వారి అభిమానం.
సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలోకి చింతమడక గ్రామం వస్తుంది. అక్కడి నుంచి కేసిఆర్ మేనల్లుడు హరీష్ రావు పోటీ చేసి గెలిచారు. కేసిఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆ నియోజకవర్గాల్లో ఆయనకు ఓటులేదు. ఈ కారణంగా ఆయన నిలబడిన రెండు చోట్ల తన కోసం తాను ఓటు వేసుకోలేకపోయారు. చింతమడకలో ఓటు వేయడం వల్ల కేసీఆర్ ఓటు హరీష్ రావు ఖాతాలో పడింది.