Excise CI dead in Road Accident(Hyderabad news today): హైదరాబాద్ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి కోర్టు సమీపంలో ఓ కారు రాంగ్ రూట్లో యూటర్న్ తీసుకుంటుండగా ఒక్కసారిగా అటుగా వచ్చిన బైక్ను ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐ సాదిక్ అలీగా, గాయలైన వ్యక్తి నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఎస్.ఐ కాజావలి మోహినుద్దీన్ గా పోలీసులు గుర్తించారు.
సీఐ సాధిక్ అలీ, ఎస్.ఐ కాజా వల్లి మోహినుదిన్ మలక్ పేట్ లోని ప్రభుత్వ క్వార్టర్స్ లో ఉంటున్నారు. ఎల్బీనగర్ లో ఓ ఫంక్షన్ కి వెళ్లి తిరిగి మలక్ పేట్ లోని క్వార్టర్స్ కి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ కారును వదిలేసి పరారైనట్టు పోలీసులు తెలిపారు. సీఐ సాధిక్ అలీకి 2 రోజుల క్రితమే మెదక్ కు ట్రాన్స్ ఫర్ అయినట్టు తెలుస్తోంది.