Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 న జరగున్నాయి. ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా రావాల్సిన రిపోర్ట్లు త్వరగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హోమ్ ఓటింగ్, ఫెసిలిటేషన్ రిపోర్ట్ను రోజూ వారీగా పంపాలని సీఈవో ఆదేశించారు.
అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆయన సూచించారు . ఇక ఓటర్ ఐడీల పంపిణీపై ఆయన ఆరా తీశారు. ఇప్పటికే 40.72 లక్షల ఓటర్ కార్డులు ప్రింట్ కాగా.. ఇప్పటికే 27లక్షలు పంపిణి చేశామని అధికారులు తెలిపారు. దీంతో వచ్చే 5 రోజుల్లో మిగిలిన ఓటర్ కార్డ్లను పంపిణి చేయాలని ఆదేశించారు. ఓటర్ స్లిప్పుల పంపిణీని కూడా రేపటిలోగా పూర్తి చేయాలన్నారు. పోలింగ్ పండుగ వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఈవో సూచించారు.