CEO Death In Ramoji Film City : హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ సీఈఓ ప్రాణాలు కోల్పోగా.. ఛైర్మన్ తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వెస్టెక్స్ సంస్థ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా విషాదం చోటు చేసుకుంది. ఆ ఫంక్షన్ లో సంస్థ ఛైర్మన్ విశ్వనాథరాజు, సీఈఓ సంజయ్ షాను ఓ కంటైనర్ బాక్స్లో కూర్చోబెట్టి.. పైనుంచి క్రేన్ సాయంతో దించుతుండగా.. సడెన్గా రోప్ తెగిపోయింది. కంటైనర్ కింద పడింది. సీఈవో సంజయ్ షా చనిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్ లో విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించింది. ఈ వేడుకలో జరిగిన క్రేన్ ప్రమాదంలో.. కంపెనీ సీఈవో సంజయ్ షా అక్కడిక్కడే మృతి చెందారు. కంపెనీ ఛైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆయనను వెంటనే మలక్పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.