EPAPER

Kishan Reddy: జమ్మూలో ఎక్కువ సీట్లు సాధించాం.. ప్రజల విశ్వాసం మాపైనే.. కిషన్ రెడ్డి

Kishan Reddy: జమ్మూలో ఎక్కువ సీట్లు సాధించాం.. ప్రజల విశ్వాసం మాపైనే.. కిషన్ రెడ్డి

Central Minister Kishan Reddy in Press meet: జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. , గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని తెలిపారు. జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని పేర్కొన్నారు. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైందన్నారు.


కేంద్ర పార్టీ నాయకత్వంలో జమ్మూకశ్మీర్ లో నాయకులు ఐకమత్యంతో కష్టపడి పనిచేశారన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ సీట్లలో బీజేపీ పార్టీ విజయం సాధించిందన్నారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి మరింత కష్టపడి పనిచేస్తామన్నారు.

Also Read: అత్తమామపై కోడలు చేతబడి ప్లాన్.. రివర్స్ ప్లాన్ వేసిన బాబా.. కట్ చేస్తే..


రాహుల్ గాంధీ ప్రజల్లో మోదీపై నమ్మకం, విశ్వాసాన్నికోల్పోయేలా ప్రసంగాలు ఇచ్చారని, వీటిని ప్రజలు నమ్మలేదన్నారు. ప్రధాని మోదీని చెడు చేసేందుకు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో కూడా ప్రస్తావించారన్నారు. తొలి 100 రోజుల్లో చేసిన అభివృద్ది ఫలితం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Related News

Harishrao: పండుగ సమయంలోనూ జీతాలివ్వరా..? ఇదేనా ప్రజా పాలన..? : హరీష్ రావు

SC Sub-Categorisation: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే..

Bhatti Vikramarka: జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు భట్టి కౌంటర్లు

Telangana Free Bus Effect: బస్సులల్లో కొట్టుకుంటున్న మహిళలు… ఇది ప్రభుత్వం తప్పా…?

Raj Pakala: 111 జీవోలో.. ‘రాజ్’ దర్బార్, బావమరిది కళ్లలో ఆనందమే లక్ష్యం – జన్వాడలో కేటీఆర్ భూ జైత్రయాత్ర

Black Magic: అత్తమామపై కోడలు చేతబడి ప్లాన్.. రివర్స్ ప్లాన్ వేసిన బాబా.. కట్ చేస్తే..

×