EPAPER

Rangareddy : శంషాబాద్ లో దొంగలముఠా బీభత్సం.. రూ.1.35 లక్షలతో పరార్

Rangareddy : శంషాబాద్ లో దొంగలముఠా బీభత్సం.. రూ.1.35 లక్షలతో పరార్

Rangareddy : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూర్ ఎక్స్ రోడ్ లో గుర్తు తెలియని దొంగల ముఠా దారి దోపిడికి తెగబడింది. అర్ధరాత్రి వస్తున్న వాహనాన్ని కాపుకాసి మరీ ఆపి.. కత్తులతో బెదిరించి గుర్తు తెలియని ముగ్గురు దొంగలు దోపిడికి పాల్పడ్డారు.


బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ లైలాండ్ వాహనంలో రమేష్, రాములు అనే ఇద్దరు వ్యక్తులు పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్డు దిగి పాలమాకుల వైపు వస్తున్నారు. అయితే మార్గం మధ్యలో గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్దకు రాగానే ఎదురుగా స్కూటీపై ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని ఆపారు. ఆ ముగ్గురు వ్యక్తులు హిందీ భాషలో మాట్లాడుతూ వారి వెంట తెచ్చుకున్న కత్తులను చూపించి రమేష్, రాములును బెదిరించి.. వారి దగ్గరున్న రూ. లక్షా 35 వేలు తీసుకున్నారు.

అక్కడ నుండి పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్డు వైపు పరారయ్యారు. దీంతో బాధితులు 100 మొబైల్ కు కాల్ చేయడంతో శంషాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Woman Burns Step-Daughter: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

Zero FIR: జానీ మాస్టర్‌ కేస్.. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఫైల్ చేస్తారో తెలుసా?

Cyber criminals: పోలీసు డీపీ.. వేస్తారు టోపీ, సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Big Stories

×