ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచన్ కూల్చివేత కేసును నాంపల్లి కోర్టులో విచారణ జరిపింది. నటుడు దగ్గుబాటి వెంకటేశ్, ఇతర కుంటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నంద కుమార్ ఫిర్యాదు మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ జరిపింది.
కోర్టు ఆదేశాలను దిక్కరించి, కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసి, ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నటుడు వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రానా, దగ్గుపాటి అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.