EPAPER

FIR on KTR : మూసీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు… పోలీసులకు ఫిర్యాదు, కేసు పెట్టింది ఏవరంటే ?

FIR on KTR : మూసీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు… పోలీసులకు ఫిర్యాదు, కేసు పెట్టింది ఏవరంటే ?

FIR on KTR : మాజీ మంత్రి,  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై  ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూరు పీఎస్’లో కేసు నమోదైంది.


మూసీపై తీవ్ర ఆరోపణలు…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మూసీ ప్రాజెక్టు సుందరీకరణ, నదీ ప్రక్షాళనపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఆత్రం సుగుణ కంప్లైంట్…

ప్రభుత్వంపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నోరుపారేసుకుంటున్నారని, లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కావాలనే ఇబ్బందిపెట్టేందుకు రాజకీయంగా యత్నిస్తున్నారని కంప్లైంట్ లో వివరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రూ.25 వేల కోట్లు దిల్లీకి…

మూసీ ప్రాజెక్టు కోసం తెలంగాణ సర్కారు దాదాపుగా రూ.లక్షన్నర కోట్ల రూపాయల మేర కుంభకోణం చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే సుమారుగా రూ.25 వేల కోట్లు దిల్లీకి పంపిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీంతో సుగుణ పోలీసులను ఆశ్రయించింది. ఇటీవలే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సుగుణ,  బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ చేతిలో 90 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం.

also read : ఢిల్లీకి మూటలు పంపడమే మీ పనా..? : కేటీఆర్

Related News

Konda Surekha: మంత్రి కొండా, ఎంపీ రఘునందన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్.. ఒకరు మాజీ సర్పంచ్.. మరొకరు ?

TPCC Chief: గాంధీ భవన్‌లో కీలక మీటింగ్.. ఆ ఆపరేషన్ షురూ!

KTR: ఢిల్లీకి మూటలు పంపడమే మీ పనా..? : కేటీఆర్

IAS Officers: క్యాట్‌లోనూ ఆ ఐఏఎస్‌లకు చుక్కెదురు.. వెళ్లిపోవాల్సిందేనంటూ..

CM Revanth Reddy : మరోసారి హస్తీనాకు సీఎం రేవంత్‌రెడ్డి… ఆశావహుల్లో ఉత్కంఠ

MP Aravind: బీఆర్ఎస్‌కు పట్టిన గతే.. మీకూ పడుతుంది: ఎంపీ అరవింద్

Big Stories

×