Bus Accident : హన్మకొండ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఎల్కతుర్తి సమీపంలో.. రన్నింగ్ లో ఉండగానే బస్సు చక్రాలు ఊడిపోయాయి. ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
హుజురాబాద్ డిపోకు చెందిన అద్దె బస్సు TS02 UC 5936.. హన్మకొండ సర్వీసులో భాగంగా హుజురాబాద్ నుంచి హన్మకొండ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఉన్న బస్సు చక్రాలు ఊడిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయానికి బస్సులో 80 మంది ప్రయాణికులకు ఉన్నట్లు సమాచారం.
పెను ప్రమాదం తప్పిందని.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి కండీషన్ లేని బస్సును ఎలా తిప్పుతారని ప్రయాణికులు డ్రైవర్ను ప్రశ్నించారు. ఓవర్ లోడ్ కారణంగానే బస్సు చక్రాలు ఊడిపోయాయని బస్సు డ్రైవర్ పేర్కొన్నాడు.