BRS: మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు.. చాకలి, మంగళి కులస్థులకు క్షమాపణలు చెప్పారు. మిర్యాలగూడలో చేపట్టిన దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో తమ మనోభావాలు దెబ్బతినేలా mla వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని ఆ కులసంఘం నేతలు ఆందోళన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వారికి సారీ చెప్పారు.
మిర్యాలగూడలో దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. తనను స్టేజీపైకి పిలువలేదని స్థానిక ఎంపిపీ అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో ఎమ్మెల్యే భాస్కర్ రావు..సదరు ఎంపీపీపై ఫైర్ అయ్యారు. అధికారులు మర్చిపోయి ఉండొచ్చు.. చాకలి, మంగలి పనులు కూడా తానే చేయాలా అంటూ అసహనం వ్యక్తం చేసారు.
బహిరంగ సమావేశాల్లో ఎమ్మెల్యే తమ కులాన్ని తక్కువ చేసి మాట్లాడారని ఆ సామాజిక వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే భాస్కర్ రావు.. చాకలి, మంగళి కులస్థులకు క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వంగా అనలేదని వివరణ ఇచ్చారు.